అన్నమయ్య జిల్లా కేవిపల్లి మండలంలో ఎర్రచందనం అక్రమ రవాణా పై టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం మెరుపు దాడులు నిర్వహించారు. కె.వి.పల్లి మండలంలో ఎల్లమంద గ్రామం వద్ద అంకేం రమణ ఇంటి సమీపంలో రెండు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని, కర్ణం వారి పల్లి–కంపల్లి మధ్య అటవీ ప్రాంతంలో మరో ఐదు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన మొత్తం 7ఎర్రచందనం దుంగలతో పాటు పత్తిపాటి త్యాగరాజు నాయుడు (36), అంకేం రమణ(46), పి.సురేంద్ర (30) అనే ముగ్గురు నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకుని అరెస్టు చేసి కె.వి. పల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.