రైతులకు సహకార సంఘానికి మధ్య ఉద్యోగులు కీలకపాత్ర పోషించాలి
Ongole Urban, Prakasam | May 9, 2026
రైతులకు సహకార సంఘానికి మధ్య ఉద్యోగులు కీలకపాత్ర ఉందని ఉద్యోగుల హక్కుల కోసం ప్రభుత్వంతో చర్చించి సానుకూలంగా పరిష్కరిస్తామని జాతీయ కార్యదర్శి వెంకటాచలం అన్నారు. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ 14 రాష్ట్ర మహాసభలు నగరంలోని సాయి iTA కన్వెన్షన్ హాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ సభకు అధ్యక్షులుగా పిఎస్ రవి వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఆనుగుణంగా ఉద్యోగులు కష్టపడి పనిచేసి ఫలితాలు సాధించాలని అన్నారు. 14 రాష్ట్ర మహాసభలు ఒంగోలులో జరగటం చాలా సంతోషం అని మహాసభలు విజయవంతం కావాలని ఆయన కోరారు.