మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని పుల్లయ్య హోటల్ లో సోమవారం అర్ధరాత్రి తర్వాత హోటల్లోకి ప్రవేశించిన దొంగలు చోరీకి పలుపడ్డారు. కౌంటర్ లోని పదివేల రూపాయలు నగదు, సీసీ కెమెరాలు, హార్డ్ డిస్క్, మోనిటర్లు దొంగలు చోరీ చేసి తీసుకువెళ్లారు. మంగళవారం ఉదయాన్నే హోటల్ తెరిచేందుకు వచ్చినా యజమాని దొంగలు పడ్డారన్న విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు జరిగిన దొంగతనంపై దర్యాప్తు చేస్తున్నారు.