తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు తగిన స్థాయిలో ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సమ్మిట్ ప్రాంగణాన్ని శనివారం సాయంత్రం సందర్శించి, భద్రతాపరమైన అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మూసీ పునరుజ్జీవం సహా పలు కార్యక్రమాలకు సంబంధించి ప్రదర్శించే డిజిటల్ స్క్రీనింగ్ను పరిశీలించారు. ముందుగా ఏరియల్ వ్యూ ద్వారా ప్రాంగణాన్ని సీఎం చూశారు.