కాట్నే కాలువ కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం
Anantapur Urban, Anantapur | Apr 2, 2026
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ మండలం కాట్నే కాలువలో గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో కుటుంబ సమస్యలతో బాధపడుతూ నరేష్ అనే వ్యక్తి ఇంటిలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.