నంద్యాల అర్బన్: జాతీయ ఉపాధ్యాయ అవార్డు 2025 దరఖాస్తులకు గడవు పొడిగింపు: నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి
Nandyal Urban, Nandyal | Jul 14, 2026
జాతీయ ఉపాధ్యాయ అవార్డు-2025కు దరఖాస్తు చేసుకునే గడువును భారత ప్రభుత్వ విద్యాశాఖ పొడిగించింది. ఈ మేరకు నంద్యాల DEO జనార్దన్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని ప్రభుత్వ, జడ్పీ, ఎంపీపీ, ఎయిడెడ్, కేంద్రీయ విద్యా లయాలు, జవహర్ నవోదయ, అటామిక్ ఎనర్జీ, సైనిక్, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేస్తున్న అర్హులైన ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు