దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలం టిడిపి అధ్యక్షుడిగా లక్కవరానికి చెందిన మేడగం వెంకటేశ్వర రెడ్డిని టిడిపి నాయకులు ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా దర్శి టిడిపి ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మికి, కడియాల లలిత్ సాగర్ కు మండల నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. టిడిపి బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.