రాజేంద్రనగర్: స్వచ్ఛతతో పల్లెలు మెరువాలి : రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
స్వచ్ఛతతో పల్లెలు మెరవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా స్వచ్ఛతా హి సేవ-2025 కార్యక్రమాన్ని ప్రారంభించారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జిల్లాలోని అన్ని మండలాలు, అన్ని గ్రామాలలో స్వచ్ఛోత్సవ్ కార్యక్రమాలు జరపాలన్నారు. పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, స్వచ్ఛతపై చిత్రలేఖన పోటీలు నిర్వహించాలన్నారు.