భర్తపై భార్య తరపు బంధువులు విచక్షణారహితంగా దాడి
Anantapur Urban, Anantapur | Apr 19, 2026
శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం యాకర్లకుంటపల్లి గ్రామానికి చెందిన సోమశేఖర్ అనే వ్యక్తిపై వారి భార్య తరపు బంధువులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడినట్లుగా బాధితుడు తీవ్ర ఆవేదన ను వ్యక్తం చేశాడు. తీవ్రంగా గాయాల పాలైన అతను తనపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి వివరాలు వెల్లడించారు. దీంతో అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.