అనంతపురం అర్బన్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ నగరంలోని ఆసుపత్రిలో మృతి
Anantapur Urban, Anantapur | Apr 27, 2026
ధర్మవరం పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాబు అనే వ్యక్తి నగరంలోని ప్రభుత్వ సరోజన ఆసుపత్రిలో ఉన్న అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్న మార్చురీకి తరలించారు.