అన్నమయ్య జిల్లా. మదనపల్లె పట్టణం ఎస్బిఐ కాలనీలో గల గ్లోబల్ మల్టీస్పెషల్టి హాస్పిటల్ లో వైజాగ్ కు చెందిన యమునా అనే మహిళకు కిడ్నీలు తొలగించడంతో ఆమె మృతి చెంది. కిడ్నీ రాకెట్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఇప్పటికే పలువురుని మదనపల్లె పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నీ రాకెట్ కేసులో రెండవ ముద్దాయిగా ఉన్న డాక్టర్ పార్థసారథి రెడ్డి , గురువారం మదనపల్లె ఏజేఎంఎఫ్సి కోర్టులో లొంగిపోయారు. పార్థసారధి రెడ్డి కు కోర్టు రిమాండ్ విధించగా పోలీసులు ఆయనను జైలుకు తరలించారు.