ఒంగోలు అర్బన్: కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని జిల్లా అభివృద్ధి కి అధికారులు దృష్టి సారించాలని కోరిన ఎంపి
Ongole Urban, Prakasam | Jul 4, 2026
కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని జిల్లాను అభివృద్ధి చేయడానికి అధికారులు మరింత దృష్టి సారించాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన అధ్యక్షతన ప్రకాశం భవనంలో ' దిశా ' సమావేశం జరిగింది. ఉపాధి హామీ, జల జీవన్ మిషన్, వ్యవసాయ, విద్యుత్, విద్య, పబ్లిక్ హెల్త్, జాతీయ రహదారులు, బిఎస్ఎన్ఎల్, తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. జిల్లాలోని పరిస్థితులను పరిగణలోకి తీసుకొని అవసరమైన ప్రతిపాదనలు, నివేదికలను ప్రభుత్వానికి సమర్పించడం ద్వారా నిధులను సమర్ధంగా వినియోగించుకోవాలని ఎంపీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.