బనగానపల్లెలో పాత ఎమ్మార్వో కార్యాలయాన్ని పరిశీలించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
బనగానపల్లె పట్టణంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పాత ఎమ్మార్వో (ప్రస్తుత ఆర్టీవో) కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయ పునరుద్ధరణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన, పనులు నాణ్యతతో చేపట్టాలని అధికారులకు సూచించారు. పురాతన భవనం కావడంతో మరమ్మతులు అత్యంత జాగ్రత్తగా చేయాలని ఆదేశించారు.