అనంతపురం జిల్లా కేంద్రంలో శుక్రవారం నాలుగున్నర గంటల సమయంలో రాప్తాడు ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మకు పుట్లూరు మండలంలో చెరువులకు నీటిని విడుదల చేయాలని వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రాప్తాడు ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ పుట్లూరు మండలంలో అనేక చెరువులో నీరు లేక ఆయకట్టు సాగుచేసిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి సమస్యలు పరిష్కరించాలని పుట్లూరు మండలం రైతు సంఘం నేతలతో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చామని రాప్తాడు మల్లికార్జున పేర్కొన్నారు.