పెండింగ్ సమస్యలు పరిష్కరించాలంటూ PRTU ఆధ్వర్యంలో ధర్నా
Ongole Urban, Prakasam | Apr 21, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద PRTU ఆధ్వర్యంలో మంగళవారం భారీ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు తమ యొక్క పెండింగ్ సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఉపాధ్యాయులు చేపట్టిన ధర్నాకు ఏపీ ఎన్జీవో ప్రతినిధులు హాజరై సంఘీభావాన్ని తెలియజేశారు. పిఆర్సి బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. తమ యూనియన్ ఏర్పడిన 12 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి ధర్నా చేయవలసి వచ్చింది అనే బాధతోనే ధర్నా చేపట్టామని తమ పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు.