కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని గూబనపల్లి వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆర్టీసీ బస్సు కారును ఢీకొన్న ఘటనలో హనుమంతరాయుడు, శివకుమార్, చంద్రకళ మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేశారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్ పై సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆర్టీసీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.