జడ్చర్ల: వర్షాలకు అలుగు పారుతుండటంతో గ్రామస్థుల ఇబ్బందులు: ఎమ్మెల్యే హామీ
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల- ఆలూరు మార్గంలో కురుస్తున్న వర్షాలకు అలుగు పారుతుండటంతో గ్రామస్థులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను కాంగ్రెస్ నాయకులు, తహశీల్దార్ నర్సింగ్ రావు పరిశీలించి, ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డికి తెలియజేశారు. స్పందించిన ఎమ్మెల్యే, సమస్య పరిష్కారానికి ఐదు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం, కొత్త అలుగు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.