పెద్ద కడబూరు: మండలం దొడ్డిమేకల గ్రామానికి చెందిన తెలుగు లక్ష్మి వ్యక్తిగత సమస్యలతో పెద్దకాలువ మెయిన్ బ్రిడ్జి వద్ద నీళ్లలో దూకింది. గమనించిన చిన్నకడబూరు గ్రామానికి చెందిన దశరథ రామ్ రెడ్డి, భీమిరెడ్డి వెంటనే నీళ్లలోకి దూకి ఆమెను రక్షించారు. విషయాన్ని పెద్ద కడబూరు పోలీసులకు తెలియజేయగా, వారు ఘటనా స్థలానికి వచ్చి లక్ష్మి కుటుంబసభ్యులతో కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం ఇంటికి పంపించినట్లు గురువారం తెలిపారు.