వెదురుకుప్పం మండలంలో పకృతి వ్యవసాయానికి అన్ని విధాల ప్రోత్సాహకం అందిస్తామని వ్యవసాయాధికారి వనిత తెలిపారు. పకృతి వ్యవసాయ లాభాలపై ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం మహిళా సంఘాలకు అవగాహన కల్పించారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించేందుకు వీలవుతుందన్నారు. ఎంపీడీవో పురుషోత్తం, ఏపీఎం పరుశురామరెడ్డి, టీడీపీ నేత మోహన మురళి తదితరులు పాల్గొన్నారు.