శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని కదిరి నియోజకవర్గం దేవీ రెడ్డిపల్లి వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి కోల్కతాకు చెందిన మసూద్ అనే కార్మికుడికి గాయాలయ్యాయి. గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం శుక్రవారం రాత్రి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.