అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం కేంద్రం లోని పేద ప్రజలకు వెంటనే ఇంటి పట్టాలను ఇవ్వాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం విడపనకల్లు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఉరవకొండ నియోజకవర్గ సహాయ కార్యదర్శి బి.చెన్న రాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పేద ప్రజలకు కేవలం ఇంటి పట్టాలు మాత్రమే ఇచ్చి కనీసం స్థలం ఎక్కడుందో కూడా చూపించలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం అయినప్పటికీ ఇంతవరకు పేద ప్రజలకు న్యాయం చేయలేదు అని ఆరోపించారు. కావున వెంటనే కూటమి ప్రభుత్వం మూడు సెంట్లు స్థలమిచ్చి న్యాయం చేయాలన్నారు.