మంత్రాలయం:మాధవరం పోలీస్ స్టేషన్ పరిధిలో అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ దగ్గర మంగళవారం అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు మాధవరం పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ వీరేశ్ తెలిపారు. ముందస్తుగా వచ్చిన సమాచారంతో ఆదోని నుంచి వస్తున్న లారీని ఆపి తనిఖీ చేయగా అందులో 700 బస్తాల రేషన్ బియ్యం ఉన్నట్లు తెలిపారు. సదరు లారీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.