అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని బీసీ కాలనీలో గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో కుటుంబ కలహాలతో విచక్షణ కోల్పోయిన భర్త ఆంజనేయులు తన భార్య శాంతి(33) కొడవలితో హతమార్చాడు. భార్యాభర్తల మధ్య అనుమానం పెనుభూతంగా మారింది. లారీ డ్రైవర్ వృత్తితో జీవించే ఆంజనేయులు భార్యపై అనుమానం ముదిరి మారణాయుధంతో దాడి చేసి హత మార్చాడు. ఘటన స్థలాన్ని ఉరవకొండ రూరల్ సిఐ మహానంది బెలుగుప్ప ఎస్సై శివ, ట్రైనీ ఎస్ఐ మహేష్ లు పరిశీలించి ఘటన పై స్థానికులు, బంధువులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు.