ఖైరతాబాద్: ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లిని హత్య చేసిన కూతురు
ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన జరిగింది. కన్న తల్లిని కూతురు కొట్టి చంపేసింది. లీలానగర్లో లక్ష్మి(82) నివాసం ఉంటోంది. కుటుంబ కలహాలు, మనస్పర్థల కారణంగా మాధవి ఓ ఇనుప రాడ్డుతో తల్లి మీద దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రగాయాలై లక్ష్మి చనిపోయింది. ఎస్ఆర్నగర్ పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.