ముషీరాబాద్లో భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయిని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే.లక్ష్మణ్ ఘనంగా కొనియాడారు. విలువలతో కూడిన రాజకీయాలకు వాజ్పేయి ప్రతీక అని పేర్కొన్నారు. ఆయన శత జయంతి సందర్భంగా బాగ్ లింగంపల్లిలోని వాజ్పేయి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం మహిళలకు ఉచితంగా చీరల పంపిణీ చేశారు