కనిగిరి మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం శ్రీ భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బందితో కలిసి సత్య సాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని అన్నారు. సత్య సాయి బాబా స్థాపించిన సేవా సంస్థలు విద్య, తాగునీరు, వైద్యం వంటి మౌలిక సదుపాయాలు ప్రజలకు కల్పించాయని తెలిపారు.