పాణ్యం మండలం మద్దూరు గ్రామంలోని మంచినీటి బావికి సుమారు 250 ఏళ్ల చరిత్ర ఉందని గ్రామస్థులు తెలిపారు. కొత్తూరు సుబ్బరాయుడు క్షేత్రానికి, గ్రామ ప్రజలకు ఇదే ప్రధాన తాగునీటి ఆధారమని పేర్కొన్నారు. నాటి నుంచి నేటి వరకు ఎలాంటి కాలంలోనూ ఈ బావి ఎండిపోలేదని, నిరంతరం నీరు లభిస్తోందని తెలిపారు. ఇప్పటికీ గ్రామస్థులు ఈ నీటిని తాగునీటిగా వినియోగిస్తూ, మిగిలిన నీటిని పొలాలకు మళ్లిస్తున్నట్లు వెల్లడించారు..