అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో శుక్రవారం ఉదయం 11:30 నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు కనుమ పండుగ సందర్భంగా రాప్తాడు అనంతపురం రూరల్ ఆత్మకూరు కనగానపల్లి రామగిరి మండలాల్లో అమ్మవారి ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి జంతుబలి సమర్పించారు. అనంతపురం రూరల్ లోని నరిగమ్మ అమ్మవారి ఆలయం వద్ద విశేష సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని జంతుబలి సమర్పించారు. అదేవిధంగా నసనకోట గ్రామంలో ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం నందు కూడా ఆంధ్ర కర్ణాటక నుంచి విశేష సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని కనుమ పండుగ సందర్భంగా ముత్యాలమ్మ అమ్మవారికి జంతుబలి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.