బనగానపల్లె: శనివారం కోవెలకుంట్లకు రానున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, కలెక్టర్ రాజకుమారి
నంద్యాల జిల్లా కోవెలకుంట్లలోని ఇందిరా ఫంక్షన్ హాల్లో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు 'అన్నదాత సుఖీభవ—పీఎం కిసాన్' నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించనున్నారు. కార్యక్రమానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, నంద్యాల కలెక్టర్ రాజకుమారి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరారు.