జిల్లాలో సొంత భూమి కలిగిన భూ యజమానులందరూ జాయింట్ ఎల్ పి ఎం విభజన (Land Parcel Map splitting) కొరకు దరఖాస్తులను ఈ నెల 31 లోపు తప్పనిసరిగా సంబంధిత సచివాలయాలు లేదా మీసేవ కేంద్రాలలో సమర్పించవలసిందిగా జిల్లా సంయుక్త కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ సందర్భంగా జిల్లా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ... ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న ప్రత్యేక అవకాశం వల్ల డిసెంబర్ 31 వరకు దరఖాస్తు రుసుం కేవలం రూ.50 మాత్రమే ఉంటుందని దీనిని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. డిసెంబర్ 31 తర్వాత ఈ రుసుం రూ.550 కి పెరుగుతుందన్నారు. అందువల్ల ఈ సదవకాశాన్ని వినియోగించుకుని, జాయింట్ ఎల్పిఎం విభజన చేయించ