నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రులు సత్య కుమార్ యాదవ్, ఫరూక్, జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. వాజ్పేయి పాలనలో సుపరిపాలన, జాతీయ ఐక్యత, సమగ్ర అభివృద్ధి విధానాలు దేశానికి కొత్త దిశ చూపించాయని వారన్నారు.