విశాఖపట్నంలో ఈ నెల 31 నుంచి జనవరి 4 వరకు జరగనున్న సిఐటియు 18వ అఖిలభారత మహాసభలను జయప్రదం చేయాలని కల్లూరు అర్బన్ బళ్లారి చౌరస్తా సి. క్యాంపు సెంటర్, వైభవ్ కాలనీలో ఆటో కార్మికులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నూతన ఆటో స్టాండ్ల వద్ద సిఐటియు జెండాలను ఎగురవేశారు. అధిక చలానాలు, 15 ఏళ్లు దాటిన వాహనాలపై పెంచిన టాక్స్ ఫీజులను వెంటనే రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. కార్మిక సమస్యలపై మహాసభలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.