ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలో ఘనంగా కందుకూరి వీరేశలింగం జయంతి వేడుకలు
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (APUS) ఆళ్లగడ్డ మండలం శాఖ ఆధ్వర్యంలో కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రావు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమాజ సంస్కరణలు, స్త్రీ విద్యాభివృద్ధిలో ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.