అనంతపురం జిల్లా వడ్డుపల్లి వద్ద ద్విచక్ర వాహనాన్ని ఎనుము ఢీకొన్న ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలు ఒకరి పరిస్థితి విషమం
Anantapur Urban, Anantapur | Apr 12, 2026
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం లోని ఆత్మకూరు మండలం వొడ్డుపల్లి వద్ద జాతీయ రహదారిపై టోల్ గేట్ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఎనుము ఢీకొన్న ఘటనలో అనంతపురం నగర శివారులోని సిండికేట్ నగర్ కు చెందిన కిరీటి తోపాటు బసప్పలకు గాయాలయ్యాయి. వీరిలో కిరీటి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. గాయపడిన వారిద్దరిని 103 నేషనల్ హైవే అథారిటీ వారి అంబులెన్స్ సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.