నంద్యాలలో ఉగాది పురస్కార గ్రహీతకు సత్కారం
Nandyal Urban, Nandyal | Apr 12, 2026
ఇటీవల ప్రభుత్వంచే ఉగాది పురస్కారం అందుకున్న నంద్యాలకు చెందిన సాహితీవేత్త వైష్ణవ వెంకట రమణ మూర్తిని కళారాధన సాంస్కృతిక సంస్థ కార్యాలయంలో కళారాధన, నంద్యాల లయన్స్ క్లబ్ సంయుక్తంగా ఘనంగా సత్కరించారు. రమణమూర్తి అనేక కావ్యాలు రచించడమే కాకుండా పద్య సాహిత్య ప్రాచుర్యానికి చేసిన సేవలు విశిష్టమైనవనీ ప్రశంసించారు. తెలుగు పద్యం ప్రాచుర్యానికి తన జీవితమంతా కృషి చేశారని తెలిపారు.