డోన్: మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన బేతంచెర్ల మండల టిడిపి కన్వీనర్ ఎల్ల నాగయ్య
Dhone, Nandyal | May 5, 2026 నంద్యాల జిల్లా బేతంచర్ల మండలంలోని రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయాలను మంత్రి నారా లోకేశ్ అడిగి తెలుసుకున్నారు. మండల టీడీపీ కన్వీనర్ ఎల్ల నాగయ్య మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల అమలు, వాటి పట్ల ప్రజల్లో ఉన్న స్పందనపై లోకేష్ ఆరా తీశారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాగయ్యకు మంత్రి దిశానిర్దేశం చేశారు.