ఒంగోలు అర్బన్: సుందర ఒంగోలు స్వర్ణాంధ్ర స్వచ్ఛంద ద్వారా సాధ్యం: ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్
Ongole Urban, Prakasam | Jun 20, 2026
ఒంగోలు నగరంలో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ నగరంలో పరిశుభ్రత, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ మరియు ప్రజల భాగస్వామ్యంతో నగర అభివృద్ధి లక్ష్యాలపై అందరకి అవగాహన వుండాలి అన్ని తెలియజేసారు. స్వచ్ఛమైన, సుందరమైన ఒంగోలు నిర్మాణం ద్వారానే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని సాధించగలమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఒంగోలును పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. ఒంగోలు నగరంలో నాణ్యమైన మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు