ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ ఎక్స్ రోడ్డు వద్ద ఎస్సై శ్యాంరావు శుక్రవారం సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ద్విచక్రవాహనాలను ఆపి వారికి బ్రీత్ ఎనైజర్ తో తనిఖీలు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా,ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోయినా, అనుమతి పత్రాలు లైసెన్స్ లేకపోయినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. ఈ తనిఖీల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.