ఒంగోలు అర్బన్: 22(ఏ) భూముల పత్రాల పరిశీలన, నివేదిక రూపకల్పన లో ఏకరూపత ఉండాలి :జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి
Ongole Urban, Prakasam | Apr 22, 2026
నిషేధిత 22(ఏ) భూములకు సంబంధించిన పత్రాల పరిశీలన, నివేదిక రూపకల్పన ప్రక్రియలో ఏకరూపత ఉండాలని జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి చెప్పారు. వీటికి సంబంధించిన పత్రాలను బుధవారం ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాలులో ఆమె సమక్షంలో అధికారులు పరిశీలించారు. ఈ ప్రక్రియ కోసం ఇప్పటికే ప్రత్యేక బృందాలను కలెక్టర్ నియమించారు. ఈ భూములకు సంబంధించిన పత్రాలను తొలుత తహసిల్దార్, ఆర్డిఓ పరిశీలించిన అనంతరం, కలెక్టరేట్ పరిపాలన విభాగంలోని వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్ల నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు పరిశీలించాల్సి ఉంటుంది. అనంతరం ఇవి డిఆర్ఓ, జాయింట్ కలెక్టర్ పరిశీలిస్తారు