డోన్: బేతంచెర్ల మండలంలో 28 ఏళ్ల తర్వాత కలుసుకున్న పదవ తరగతి విద్యార్థులు
Dhone, Nandyal | May 31, 2026 సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని రంగాపురం జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యా యులు శేషాచలం అన్నారు. ఆదివారం రంగాపురం జడ్పీ హైస్కూల్లో 1997-98 విద్యా సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 28 ఏళ్లకు ఒకేచోట పూర్వ విద్యార్థులు తమ చిన్ననాటి స్నేహితులను, గురువులను కలుసుకుని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం గురువులను సన్మానం చేశారు.