నంద్యాలలో దొంగల బీభత్సం
Nandyal Urban, Nandyal | Apr 12, 2026
నంద్యాల పట్టణ పోలీస్ కాలనీలోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దొంగలు పడి హుండీని ఎత్తుకెళ్లడం స్థానికంగా కలకలం రేపింది. శనివారం అర్ధరాత్రి పక్కా ప్లాన్తో చొరబడిన గుర్తుతెలియని కేటుగాళ్లు, ఆధారాలు దొరక్కుండా సీసీ కెమెరాలను ధ్వంసం చేసి మరీ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఆలయ హుండీని సమీపంలోని పొదల్లో పగులగొట్టి అందులోని నగదును దోచుకెళ్లగా, సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తును ముమ్మరం చేశారు