మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజు, విజయలక్ష్మి దంపతులు. కొంతకాలంగా ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం మరోసారి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో భార్యపై రాజు దాడి చేయగా ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మరణించింది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు