నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో బోల్తాపడిన బొప్పాయి పండ్ల లారీ
Nandyal Urban, Nandyal | Jul 8, 2026
నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం గోవిందపల్లె వద్ద బొప్పాయి పండ్ల లారీ బోల్తా పడింది. కడప నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు అదుపుతప్పి రోడ్డు పక్కన పడిపోయింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్కు స్వల్ప గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.