షాద్నగర్ సమీపంలోని సీఎస్కే విల్లాలో ఉన్న సమస్యలను తీర్చాలని మున్సిపల్ కమిషనర్ సునీతకు కాలనీవాసులు వినతిపత్రం అందించారు. కాలనీలో ఎదురవుతున్న వీధిదీపాలు, రహదారుల దుస్థితి, డ్రైనేజీ సమస్యలు రహదారుల వెంట పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారం కోసం కమిషనర్ వెంటనే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.