ఒంగోలు అర్బన్: మత్తు పదార్థాల వినియోగానికి ప్రజలందరూ దూరంగా ఉండాలి : కలెక్టర్
Ongole Urban, Prakasam | Jun 26, 2026
మత్తు పదార్థాల వినియోగానికి ప్రజలందరూ దూరంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. యువత సరదా కోసం అటూ వీటిని అలవాటు చేసుకుంటే భవిష్యత్తు మొత్తం అంధకారం అవుతుందన్నారు. వీటిని సేవించడం ద్వారా మానసిక అసమతుల్యతకు గురై నేరాలకు పాల్పడుతున్న సందర్భాలు ఉన్నాయన్నారు. నేడు జైళ్లలో ఉన్న యువతలో ఎక్కువమంది వీటి ప్రభావానికి గురైన వారేనని ఆయన పేర్కొన్నారు. స్కూల్, కాలేజీలకు వెళుతున్న తమ బిడ్డలు ఏమి చేస్తున్నారో తల్లిదండ్రులందరూ కూడా గమనిస్తూ ఉండాలని కలెక్టర్ సూచించారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీల్లోని విద్యార్థుల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.