ఆళ్లగడ్డ: అహోబిలం హత్య కేసులో ముద్దాయి అరెస్ట్ :రిమాండ్కు తరలింపు, ఆళ్లగడ్డ డిఎస్పి శ్రీనివాసరావు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలం గ్రామంలో ఇటీవల జరిగిన హత్య కేసులో ప్రధాన ముద్దాయిని పోలీసులు అరెస్టు చేశారు,ఈ విషయాన్ని ఆళ్లగడ్డ డీఎస్పీ ఎ. శ్రీనివాసరావు బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు,జిల్లా ఎస్పీ సునీల్ షౌరాణ్ ఐపీఎస్ ప్రత్యేకపర్యవేక్షణలో, డీఎస్పీ ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ రూరల్ సర్కిల్ సీఐ బీవీ రమణ, ఎస్ఐ యూవీ వరప్రసాద్లు ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేసి ముద్దాయిని అదుపులోకి తీసుకున్నారు, వివరాల ప్రకారo అహోబిలం గ్రామానికి చెందిన కొమెర శివ అలియాస్ వల్లెపు శివ (27) మరియు నారాయణపురం గ్రామానికి చెందిన ఎరుకలి శంకర్ ఇద్దరూ ఒకే షెడ్డులో నివసిస్తూ మద్యం సేవించే అలవాటు కలి