ప్రకాశం జిల్లా ఒంగోలు విజిలెన్స్ పోలీసులకు వారి కందిన ముందస్తు సమాచారంతో నిఘా వేసి బుధవారం ఒక్కొక్క ట్యాంకర్లు 40000 లీటర్ల డీజిల్ కలిగిన రెండు ట్యాంకర్లను పట్టుకున్నారు. వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. దర్యాప్తులో చీమకుర్తికి చెందిన ఒక వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా చెన్నై నుండి అక్రమంగా డీజిల్ తీసుకొని వచ్చి చీమకుర్తిలో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. చెన్నై నుండి తక్కువ రేటుకు డీజిల్ తెచ్చి చీమకుర్తి గ్రానైట్ క్వారీలలో పనిచేసే ట్రిప్పర్లకు బయట రేటు కంటే తక్కువ కమ్ముతూ భారీగా సొమ్ము చేసుకుంటున్నాడు.