ఒంగోలు అర్బన్: ప్లాస్టిక్ రహిత సమాజం కోసం అందరూ కలిసి పని చేయాలి : ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్
Ongole Urban, Prakasam | May 16, 2026
ప్రజలందరూ కలసి కట్టుగా ఉద్యమించి ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పని చేయాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు.ప్రతి నెలా మూడవ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒంగోలులోని కొత్త కూరగాయల మార్కెట్ వద్ద నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జోనల్ ఇంచార్జీ మద్దిపాటి వెంకట రాజు,జిల్లా పార్టీ అధ్యక్షులు ఉగ్రనరసింహ రెడ్డితో కలసి దామచర్ల జనార్దన్ రావు పాల్గొన్నారు.ఈరోజు ప్లాస్టిక్ను విడిచిపెడదామా,? రేపు మన భవిష్యత్తును బలి పెడదామా ?.. ప్లాస్టిక్ వద్దు సహజ ప్రత్యమ్నాయాలు ముద్దు అన్నారు