బనగానపల్లె: కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్లో సూసైడ్ ఘటనపై జూన్ 6న విచారణ
వెంకటసుబ్బయ్య మృతిపై కొలిమిగుండ్ల తహశీల్దార్ కార్యాలయంలో జూన్ 6న విచారణ చేపట్టనున్నట్లు బనగానపల్లె ఆర్డీవో నరేంద్రనాథ్ రెడ్డి శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. బెలుం సింగవరం గ్రామానికి చెందిన దొమ్మరి వెంకటసుబ్బయ్య ఏప్రిల్ 19న కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్లో ఉరివేసుకునే ఆత్మహత్య కు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేపడుతున్నామని, సాక్షులు హాజరై వాంగ్మూలం అందించాలని కోరారు.