మైదుకూరు: మైదుకూరు DSP కార్యాలయంలో పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ను గురువారం కర్నూలు రేంజ్ DIG కోయప్రవీణ్ ప్రారంభించారు. కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ హాజరయ్యారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసు సేవలను విస్తరిస్తున్నామని, మైదుకూరులోని ప్రధాన రహదారులపై సీసీ కెమెరాలతో పర్యవేక్షణను మరింత బలోపేతం చేస్తున్నట్టు డీఐజీ తెలిపారు.